NRI-NRT

డల్లాస్‌లో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అన్నమయ్య సప్తగిరుల సంకీర్తనోత్సవం

డల్లాస్‌లో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అన్నమయ్య సప్తగిరుల సంకీర్తనోత్సవం

సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో ఆగష్టు 31వ తేదీన డల్లాస్ పరిసర ప్రాంతమైన అలెన్‌లోని క్రెడిట్ యునియన్ కన్వెన్షన్ సెంటరులో 7వేల మందితో అన్నమయ్య సంకీర్తనోత్సవాన్ని మహాబృందగళార్చన పేరిట నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. అన్నమయ్య రచించిన సప్తగిరుల సంకీర్తనలను 7వేల మంది ఏడుకొండలవాడికి అర్చనగా ఆలపిస్తారని తెలిపారు. జులై 31వ తేదీ లోపల ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే వారు https://annamayya.siliconandhra.org/ వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. సంగీత పరిజ్ఞాన ప్రవేశం లేనివారు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని ఆనంద్ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z