DailyDose

భార్య అందంగా ఉందని హత్య-CrimeNews-Aug 15 2024

భార్య అందంగా ఉందని హత్య-CrimeNews-Aug 15 2024

* భార్య ఎంతో అందంగా ఉండటం, గ్రామంలో బాగా తయారై బయటకు వెళ్లడాన్ని భర్త సహించలేకపోయాడు. ఇదే విషయమై అనేకసార్లు గొడవ పడేవాడు. ఆఖరికి నమ్మించి బయటకు తీసుకెళ్లి హత్య చేశాడు. కర్ణాటకలో రామనగర జిల్లా మాగడికి చెందిన దివ్య (32), ఉమేశ్‌ భార్యా భర్తలు. అందంగా కనపడాలనే తపనతో దివ్య ఎప్పుడూ లిప్‌స్టిక్‌ వేసుకునేది. ఓ టాటూ కూడా వేయించుకుంది. ఈ పద్ధతులు నచ్చని ఉమేశ్‌ ఆమెతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో భర్త అనుమానాలు, వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం మాగడి ఫ్యామిలీ కోర్టులో దివ్య విడాకుల పిటిషన్‌ వేశారు. మంగళవారం ఇద్దరూ విచారణకు హాజరుకాగా ఇకపై అనుమానించనని దివ్యను ఉమేశ్‌ నమ్మించాడు. భర్త మారాడనుకుని అతడితో కలిసి దివ్య స్థానిక ఊజగల్లు దేవాలయానికి వెళ్లింది. అయితే ఆమెను హత్య చేయాలని ముందే నిశ్చయించుకున్న ఉమేశ్‌.. దర్శనం అనంతరం అక్కడి కొండ వద్దకు దివ్యను తీసుకెళ్లి తన నలుగురు స్నేహితులతో కలిసి కడతేర్చాడు. అనంతరం మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు నిందితులు పట్టుబడగా ఉమేశ్, మరొకరి కోసం గాలిస్తున్నారు.

* రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు రెండు వాహనాలను ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. గురువారం సాయంత్రం తుక్కుగూడ నుంచి శంషాబాద్‌ వైపు వెళ్తోన్న ఓ కారు అదుపు తప్పి మరో కారు, తుఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్‌ వాహనంలో ప్రయాణిస్తున్న రెండేళ్ల చిన్నారి, మహిళ, డ్రైవర్‌ మృతిచెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. బాధితులు యాదగిరిగుట్ట నుంచి వనపర్తి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

* అంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అలీ కేఫ్ సమీపంలోని పెయింట్ కంపెనీలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కంపెనీకి ఆనుకొని ఉన్న ఇంటిలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలనీల మధ్యలో అగ్ని ప్రమాదం సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

* రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్‌ గిరిజన బాలిక (Tribal girl) పై భూయజమాని అత్యాచారానికి (Atrocity) ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జిల్లాలోని శంషాబాద్ మండలం ఎర్రకుంట తండాలో చోటు చేసుకుంది. తండ్రితో కలిసి పనికి వెళ్లిన గిరిజన బాలికపై భూయజమాని కృష్ణారెడ్డి(30) బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడికి భయపడి ఆమె నోరు విప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడగా ఆమె గర్భం దాల్చింది. దీంతో బాలికను కొత్తూరు గ్రామానికి తీసుకెళ్లి అబార్షన్‌ చేయించాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా మంగళవారం తన వ్యవసాయ క్షేత్రంలో తండా, గ్రామపెద్దలను కూర్చోబెట్టి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఎలాగో తప్పు జరిగిందని, ఎంతో కొంత డబ్బు ఇచ్చి రాజీ చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. దీంతో బాలిక, కుటుంబ సభ్యులు డబ్బులకు లొంగక శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z