NRI-NRT

చికాగో ఇండియా డే పెరేడ్‌లో CAA శకటం

చికాగో ఇండియా డే పెరేడ్‌లో CAA శకటం

చికాగో ఆంధ్ర సంఘం (ఛాఆ) గత ఆదివారం నాడు ICO (Indian community outreach) Rotary Hill నేపర్విల్ లో నిర్వహించిన India Day Paradeలో తెలుగు సంయుక్త రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించారు. వేలాది మంది ప్రవాస భారతీయులు భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు ఆధ్వర్యంలో CAA బృందం ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల సంస్కృతిని తెలియజేస్తూ తెలుగు తల్లి, నందీశ్వరులతో శకటాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బోస్ కొత్తపల్లి, ఆశ్రిత్ కొత్తపల్లి, హరిణీ మేడ, శృతి కూచంపూడి, శ్రీనివాస్ పద్యాల, శ్రీ వాసవీ తెంకుమల్ల, నవీన్ కుమార్ తెంకుమల్ల, శ్వేత కొత్తపల్లి, శరణ్యా నక్క, మాలతి దామరాజు, శ్రీ వాసవీ తెంకుమల్ల, శిరీశ పద్యాల, అనూష బెస్త, లాస్య మంగిపూడి, శిరీష వీరపనేని, శ్రీ స్మిత నండూరి, శైలజ సప్ప, హరిణి మేడ, సౌజన్య దేవరపల్లి, రాధిక గరిమెళ్ళ, సత్యవాణి ప్రెక్కి, ఉమ కొత్తమాసు, తేజస్వి శరణ, ప్రసాదరావు చుండూరు, రాజశేఖర్ చుండూరు, గణేశ్ చుండూరు, కార్తిక్ చుండూరు, అభిరామ్ నండూరి, అవినాష్ నండూరి, సురేశ్ ఐనపూడి తదితరులు చేసిన్ కోలాట ప్రదర్శనలు, క్రీడా ప్రదర్శనలు, నృత్యాలు, గేయాలు ఆకట్టుకున్నాయి. బోర్డు సభ్యులు, అనూష బెస్త, శైలజ సప్ప, శ్రీ స్మిత నండూరి, లక్ష్మి నాగ్ సూరిభొట్ల, గీతిక మండల, పద్మారావు అప్పలనేని, నరేశ్ కుమార్ చింతమాని, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, శ్రీనివాస్ పద్యాల, గిరి రావు కొత్తమాసు, మనస్వి తూము, కావ్య శ్రీ చల్ల, పూర్వ అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి, ట్రస్టీలు సుజాత అప్పలనేని, మల్లీశ్వరి పెదమల్లు, దినకర్ కారుమూరి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z