NRI-NRT

వరద బాధితుల సహాయార్థం NRI TDP USA విరాళం

వరద బాధితుల సహాయార్థం NRI TDP USA విరాళం

ఉత్తర అమెరికా ఎన్నారై తెదేపా శ్రేణులు ఇటీవల ఏపీలో సంభవించిన వరదల్లో నష్టపోయిన బాధితులను ఆదుకునే నిమిత్తం ఏర్పాటు చేసిన AP CM Relief Fundకు ₹25లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును శుక్రవారం నాడు డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ డా. పెమ్మసాని చంద్రశేఖర్‌కు అందజేశారు. పార్టీ కోసమే గాక, ప్రజల కోసం కూడా పరితపించే కార్యకర్తలు కేవలం తెదేపాకే సొంతమని డా. పెమ్మసాని పేర్కొన్నారు. ఈ విరాళాలు అందజేసినవారికి ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z