Politics

రేపు మధ్యాహ్నం అడుసుమిల్లి జయప్రకాష్ అంత్యక్రియలు

రేపు మధ్యాహ్నం అడుసుమిల్లి జయప్రకాష్ అంత్యక్రియలు

మాజీ శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాష్ అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజిలో చికిత్చ పొందుతూ ఈ రోజు మృతి చెందారు. నేటి సాయంత్రానికి విజయవాడ చేరుకోనున్న ఆయన భౌతికకాయం. ఆయన కొంత కాలంగ లంగ్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. అడుసుమిల్లి జయప్రకాశ్ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం విజయవాడలోని మొగల్రాజపురంలో జరుగుతాయని ఆయన తనయుడు అడుసుమిల్లి తిరుమలేష్ తెలిపారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు.

కాకాని వెంకటరత్నం అనుచరుడుగా ఆయన ఆంధ్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుడైన అడుసుమిల్లి జయప్రకాశ్ 1983లో ఆ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. సమైక్యవాద ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు కొనసాగించకుండా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న అడుసుమిల్లి ఎన్నో రాజకీయ వ్యాసాలు రాయడమే కాక, టీవీ ఇంటర్వ్యూల్లో వర్తమాన రాజకీయాలను విశ్లేషించి మంచి రాజకీయ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z