Devotional

చాగంటి కోటేశ్వరరావుతో మండలి బుద్ధప్రసాద్ భేటీ

చాగంటి కోటేశ్వరరావుతో మండలి బుద్ధప్రసాద్ భేటీ

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావుతో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ సమావేశమయ్యారు. గురువారం నాడు హైదరాబాద్‌లో చాగంటిని కలిసిన మండలి బుద్ధప్రసాద్ తాను వ్రాసిన “కృష్ణం వందే జీవనాధారం. కృష్ణా జిల్లా ప్రగతి – నా జ్ఞాపకాలు” అనే పుస్తకాన్ని ఆయనకు బహుకరించారు. 50ఏళ్లకు పైగా కృష్ణా జిల్లాతో తనకున్న అనుబంధాన్ని ఈ పుస్తకంలో నెమరవేసుకున్నానని మండలి చాగంటికి వివరించారు. మండలి రచనకు చాగంటి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత “రైతునేస్తం” వెంకటేశ్వరరావు, బుద్ధప్రసాద్ అల్లుడు అశ్విన్‌లు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z