NRI-NRT

ఆస్టిన్‌లో ప్రవాసులను కలుసుకున్న లోకేష్

ఆస్టిన్‌లో ప్రవాసులను కలుసుకున్న లోకేష్

అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లోని టెస్లా ప్లాంటును ఏపీ మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రవాసాంధ్రులను, ఎన్నారై తెదేపా అభిమానులు, కార్యకర్తలను లోకేష్ కలిశారు. వీరితో ఉత్సాహంగా ఫోటోలు దిగారు. రాష్ట్రం పట్ల, పార్టీ పట్ల వీరి అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. లోకేష్‌ను కలిసిన వారిలో గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకటరావు, సుమంత్ పుసులూరి, దిలీప్ చండ్ర, గోగినేని కార్తీక్, కంభంపాటి బస్వంత్, మద్దిరాల సాయి, కోగంటి హేమంత్, వేములపల్లి లతీష్, కొసరాజు కిషోర్, కొసరాజు చిత్ర, చిలకలపూడి సాయి మహారాజ్, ద్రోనవళ్లి దుర్గ, ఉప్పలపాటి పవన్, తాతినేని రామకృష్ణ, ముసునూరి సుధీర్ తదితరులు ఉన్నారు. వీరిలో కొందరు డల్లాస్ నుండి ప్రత్యేకంగా లోకేష్‌ను కలిసేందుకు ఆస్టిన్ వచ్చారు

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z