Politics

శ్రీశైలంపై మోడీకి రేవంత్ ఫిర్యాదు

శ్రీశైలంపై మోడీకి రేవంత్ ఫిర్యాదు

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై సీబీఐతోపాటు సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)తో శాఖాపరమైన విచారణకు ఆదేశించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో వందల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎండీ ప్రభాకర్‌ హయాంలో ప్రభాకర్ హయాంలో ఇచ్చిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపాలని రేవంత్ రెడ్డి కోరారు. బయట ఎవరి దగ్గర నుంచి విద్యుత్ కొంటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.