NRI-NRT

శోభానాయుడి మృతి పట్ల సిలికానాంధ్ర సంతాపం

SiliconAndhra Reminds Of Their Relationship With SobhaNaidu

ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి పద్మశ్రీ కట్టా శోభానాయుడి మృతి పట్ల సిలికానాంధ్ర సంతాపాన్ని వ్యక్తపరిచింది. సిలికానాంధ్రతో శోభానాయుడికి ఉన్న అనుబంధాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ గుర్తు చేసుకున్నారు. 2008లో అమెరికాలో తాము నిర్వహించిన ప్రథమ అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనానికి అనంతరం హైదరాబాద్, విజయవాడలో నిర్వహించిన అంతర్జాతీయ నాట్య సమ్మేళనాలకు హాజరయి ప్రదర్శనలు ఇచ్చారని ఆనంద్ గుర్తు చేసుకున్నారు. అమెరికా నలుమూలల, ఆంధ్ర రాష్ట్రంలో, విదేశాల్లో ఆమె శిష్యులు శిష్యురాళ్లు కూచిపూడికి జీవం పోస్తున్నారు ఆయన అన్నారు. శోభానాయుడు మృతి సిలికానాంధ్రకు, కూచిపూడి నాట్య రంగానికి తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సిలికానాంధ్ర సభ్యులు కోరుకుంటున్నట్లు ఆనంద్ వెల్లడించారు.
శోభానాయుడి మృతి పట్ల సిలికానాంధ్ర సంతాపం-SiliconAndhra Reminds Of Their Relationship With SobhaNaidu