Devotional

అఘోరాలకు అతీత శక్తులు ఉంటాయా?

అఘోరాలకు అతీత శక్తులు ఉంటాయా?

అఘోరా…అనగానే మనకు వళ్ళు జలదరిస్తుంది..దిగంబరంగా వంటినిండా బూడిద పూసుకుని జడలు కట్టిన వెంట్రుకలూ చేతిలో మనిషి పుర్రే పట్టుకుని
భయంకలిగించేలా ఉంటారు..
వారి రోజూ ఆహారం నియమాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి..
పరిశోదన లో అఘోరాలు నాలుగు దశలు గా పూజావిధానాలు సాగిస్తారు..
కొత్తగా అఘోరా గా మారవలసిన వారు ముందుగా కఠిన నియమాలు పాఠించాలి..
శివ పూజ నిరంతరం చేయాలి ..మనిషి
మాంసాన్ని తినాలి..వందరోజుల ఈధీక్షలో
చనిపోయిన వ్యక్తి లభిస్తేనే ఆహారం లేకుంటే లేదు..
తరువాత ధశ లో గురువు మంత్రోపదేశం చేస్తాడు…ఆ మంత్రాలను పఠిస్తూ శుధీర్ఘమైన ధ్యానం చేయాలి ..నెలల తరబడీ అలా ధ్యానం చేస్తూనే ఉండాలి ..కొన్నాళ్ళు
ఉదయం సడలించి కాలకృత్యాలు తీర్చుకునే
సడలింపు ఉంటుంది తరువాత సడలింపు ఉండదు..నాలుగు నుండీ ఆరుసంవత్సరాలు వరకూ ఆధీక్ష ఉంటుంది.
మూడవదశ గురుపదేశం మంత్ర ప్రయోగం
ఈ దశలో ఆ అఘోరా సామాన్యులకు కనిపించడు అదృష్య రూపంలో గురువు ఉపదేశించిన మంత్రోచ్చరణ చేస్తూ పది నుండీ పదనైదు సంవత్సరాలు ధీక్ష చేస్తాడు
ధీక్ష ముగియగానే గురు ధర్శనం..
నాలుగవదశ
ఇదే ఆఖరు దశ ఈ దశలో వాయిస్థంబనం
జలస్థంబనం ఆత్మస్థంబనం అగ్ని స్థంబనం
పరకాయప్రవేశం..సూక్ష్మరూప ధారణం..ఇలా చాలా గొప్ప విధ్యలు గురువు ఉపదేసిస్తాడు
అలాగే ఈ విధ్యలను తన స్వవిషయాలకోసం ప్రయోగించననీ అలా చేస్తే తల పేలిపోవాలనీ శాఫాన్ని శిరోధార్యంగా శ్వీకరించి..ధీక్ష ప్రారంబిస్తారు
ఈ ధీక్ష 25 సంవత్సరాల నుండీ 40సంవత్సరాలు ఉంటుంది..
ఈ దీక్ష పూర్తి చేసిన వారు గురువు గా పిలవబడతాడు..
శివాయిజ్యం పొంది అఘోరా గా నిత్యం దైవచింతనతో శవానికి
మరో చిరునామా గా జీవిస్తారు..
నాగసాధువులు..
వీరు కూడా ఇంచు మించు ఇలాగే ధీక్ష చేసి
శివైక్యం పొందుతారు..
వీరి అధ్బుత శక్తులు..ఇందాక చెప్పుకున్నట్టు
జలస్థంబనం..వాయిస్థంబనం..అగ్ని స్థంబనం..సూక్ష్మరూప ధారణం ..పరకాయప్రవేశం..ఇవన్నీ కేవలం వారి ధ్యానం కోసం మాత్రమే వినియోగిస్తారు.
సైన్సు వీరి పట్ల ఎన్నో పరిశోధనలు చేసి ఏ సూత్రానికీ వీరి స్థితి సరిపోలక అర్థం చేసుకోలేని స్థితిలో వెనుదిరిగి పోతున్నారు….
ఒక అఘోరా ఎవరితో అయినా నాలుగు మాటలు మించి మాట్లాడ డానికి ఇష్ట పడడు
క్షణాల్లో అదృష్యం అయిపోతాడు పరిశోదన
కష్టసాధ్యం కావడం తో శాస్త్ర పరిశోధనే చేయడంలో తల మునకలు అవుతున్నారు..
ఒక అంచనా ప్రకారం మూడు కోట్ల మంది పైగా ఇలాంటి అఘోరాలు భారతదేశం లో ఉన్నారు..
ధైవానికి అవమానం జరిగినపుడూ
సమాజం క్లిష్టపరిస్థితిలోకి పోయినపుడూ వీరు శివ గణాలుగా సనాతన సైనికులుగా
మారి ధుష్టశిక్షణ కు నడుం బిగిస్తారు….
వారి శక్తులు ప్రయోగించి సమస్యను పరిష్కరిస్తారు..
మనం కుంభమేలా జరిగే ప్రదేశంలో లక్షల్లో అఘోరాలను చూస్తాం కానీ వారు అక్కడి వచ్చే సమయం లో గానీ పోయో సమయంలో గానీ ఎవరికీ తారసపడరు
ఎలా వస్తున్నారు..ఎలా పోతున్నారు..??
వారు ఆహరం తీసుకోరు మరి ఎలా జీవిస్తున్నారు..? వారి వయస్సు వందలు వేలు సంవత్సరాలు అయినా పూర్తి ఆరోగ్యం గా ఎలా ఉండగలుగు చున్నారు..??
ఇదంతా భక్తి ప్రభావం..అని మనం నమ్మక తప్పదు..మన సంసృతిలో ఎన్నో రహస్యలు
ఉన్నాయి..ఋషులూ.. యోగులు..యుగ పురుషులూ ..సృష్టి ఆరంబం నుంచీ ఇంకా జీవించి ఉన్నారని చెబితే మీరు నమ్మగలరా?
అయినా అది నిజం మరణాన్ని జయించి శాస్వత దేహాన్నీ పొందారు వాళ్ళూ ..
ఆకలి దప్పికలు లేని దైవస్వరూపంగా ఎన్నో కష్టాలకు ఓర్చి అలుపెరుగని ధీక్షతో ధైవభక్తి తో వాళ్ళీస్థితిని సాధించారు..