DailyDose

350కిలోల గంజాయి పట్టివేత-నేరవార్తలు

350కిలోల గంజాయి పట్టివేత-నేరవార్తలు

* ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్, గొలుగొండ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేసి 350 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గొలుగొండ మండలం, ఏటి గైరంపేట వద్ద వాహన తనిఖీ చేపట్టారు. ఇదే సమయంలో ఏజెన్సీ నుంచి సిమెంట్ మిక్సర్ లో దొంగచాటుగా రవాణా చేస్తున్న 350 కిలోల గంజాయిని గుర్తించారు. ఈ ఘటనలో డ్రైవర్ ను అరెస్ట్ చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

* నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన ర్యాలీ.

* మంగళగిరి గ్రామీణ పీఎస్​లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది.

* పోలీస్ కస్టడీ నుంచి పారిపోయిన సీఎం రిలీఫ్ స్కాం నిందితుడుసిఎం ఆర్ ఎఫ్ చెక్కులు మార్చి భారీ మొత్తం కాజేసేందుకు కుట్రనిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులుజార్ఖండ్ నుండి పీటీ వారెంట్ మీద తీసుకొస్తుండగా పారిపోయిన నిందితుడురెండు రోజుల క్రితం జరిగిన ఘటన, గోప్యంగా ఉంచిన సీఐడీ పోలీసులునిందితుడిపై జార్ఖండ్ లో పలు కేసులు.