DailyDose

వైకాపా వర్గాల మధ్య ఘర్షణ. ఒకరి మృతి-నేరవార్తలు

వైకాపా వర్గాల మధ్య ఘర్షణ. ఒకరి మృతి-నేరవార్తలు

* వైకాపా వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి. అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసిన వైకాపా కార్యకర్త సొంత పార్టీ వారి చేతిలోనే హత్యకు గురయ్యాడు.కడప జిల్లా కొండాపురం మండలం పి.అనంతపురంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో గురునాథ్ రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.గండికోట జలాశయం ముంపు గ్రామాల వారికి ప్రభుత్వం పరిహారం మంజూరు చేస్తోంది.అయితే జాబితాలో అనర్హులు ఉన్నారని వైకాపా కార్యకర్త గురునాథ్ రెడ్డి రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా పి.అనంతపురంలో రెవెన్యూ అధికారులు గ్రామసభ ఏర్పాటు చేసి, అనర్హుల ఏరివేత ప్రక్రియ చేపట్టారు.అభ్యంతరాలు స్వీకరిస్తున్న సమయంలో అధికారులకు ఫిర్యాదు చేసింది ఇతడే అంటూ కొందరు గురునాథ్ రెడ్డితో గొడవకు దిగారు.

* ?విద్యుత్ షాక్ గురై యువకుడు మృతి.?చిత్తూరు జిల్లా ,మొలకలచెరువు మండల కేద్రంలో ఘటన.? దీపావళి టపాసు విక్రయాల టెంట్ వేస్తూ విద్యుత్ షాక్ గురై ఆసుపత్రికి తరలించే లోపు మృతి.

* నల్లమల అటవీ ప్రాంతంలో 25 ఎర్ర చందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

* మాదాపూర్‌ లో బెంజ్ కారు బీభీత్సం సృష్టించింది.సైబర్ టవర్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్‌ ను కారు ఢీ కొట్టింది. సిగ్నల్ జంప్ చేసి మరీ బైక్‌ ను ఢీకొంది.ఈ ఘటన లో బైక్‌ పై ఉన్న ఇద్దరిలో ఒకరు గౌతమ్ దేవ్ (33) మృతి చెందగా.. ఆయన భార్య శ్వేత కు తీవ్ర గాయాలు అయ్యాయి.అక్కడే ఉన్న పోలీసులు ఆమెను హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.కారును నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మరణానికి కారణమైన కాశీ విశ్వనాథ్‌ ను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.అదే సమయంలో కారులో ఉన్న మరో వ్యక్తి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.