NRI-NRT

ఖమ్మంలో పేద విద్యార్థులకు తానా చేయూత

TANA Foundation Cheyootha In Khammam

సరస్వతి కటాక్షం కలిగి లక్ష్మీ కటాక్షం లేని విద్యా కుసుమాలకు తానా ఆధ్వర్యంలో చేయూత అందించారు. ఖమ్మంలోని బోనాల ఫంక్షన్ హాలులో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్చూవల్ విధానంలో 8మంది విద్యార్థులకు లక్ష రూపాయిల ఉపకారవేతనాలు అందించారు. తానా సహాయ కోశాధికారి కోగంటి వెంకట్ ఈ మొత్తాన్ని విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ కోశాధికారి వల్లేపల్లి శశికాంత్, తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, తానా ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్ శృంగవరపులు పాల్గొన్నారు. ఖమ్మంలోని డిస్ట్రిక్ట్‌ ఎన్నారై ఫౌండేషన్‌ ద్వారా ఈ స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు. ఖమ్మం రెండవ పట్టణ సిఐ తుమ్మా గోపి, డిఎన్‌ఎఫ్‌ సమన్వయకర్త బోనాల రామక ష్ణ, బండి నాగేశ్వరరావులు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించారు.