Fashion

శనివారం మాంసాహారం ఎదుకు నిషేధం?

శనివారం మాంసాహారం ఎదుకు నిషేధం?

మన పెద్దవాళ్ళు చెప్పిన చాలా విషయాలని మనం చాదస్తమనో, మూఢ నమ్మకం అనో కొట్టి పారేస్తూ ఉంటాం. కానీ వాటి వెనకాల ఉన్న లాజిక్ తెలిస్తే మీకే అర్ధమవుతుంది, ఎలా ఎందుకు చేయమన్నారో. ఆ లాజిక్ ఏమిటో చూసేయండి మరి.
1. రాత్రి పూట రావి చెట్టు కింద నిలబడకూడదు – ఎందుకంటే రావి చెట్టు పగలంతా ఆక్సిజెన్ ని విడుదల చేస్తుంది, రాత్రి మాత్రం కార్బన్ డయాక్సైడ్ ని విడుదల చేస్తుంది.
2. నిమ్మకాయలు, పచ్చి మిర్చి వేలాడదీయడం – నిమ్మకాయలు, పచ్చి మిర్చి రెండింటికీ క్రిమి కీటకాలని నశింప చేసే గుణాలు ఉన్నాయి. వీటిని కట్టడం వల్ల అవి ఇంట్లోకి రావు.
3. సూర్యాస్తమయం తరువాత గోర్లు కత్తిరించకూడదు – పూర్వ కాలం లో ఎలెక్ట్రిసిటీ లేనప్పుడు ఇలా చేయమని చెప్పేవారు, ఎందుకంటే సరిగ్గా కనపడక వేలికి గాయం అవుతుందేమోనని.
4. పీరియడ్స్ టైమ్ లో స్త్రీలు గుడికి వెళ్ళకూడదు – అప్పట్లో స్త్రీలకి శానిటరీ న్యాప్కిన్స్, పెయిన్ కిల్లర్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కావు. గుడికి వెళ్ళడం, అక్కడ బోలెడంత సేపు నిలబడి ఉండటం ఆ సమయం లో ఆడవాళ్ళకి ఎంతో ఇబ్బందిగా ఉండే వ్యవహారం. అందుకనే వారు ఆ సమయం లో గుడికి వెళ్ళకూడదనీ, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలనీ చెప్పేవారు.
5. వారంలో కొన్ని రోజులు మాంసాహారం తీసుకోరాదు – ఇండియాలో ఎంతో మంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. వారు వారం లో ఒకటి రెండు రోజులైనా మాంసాహారం తినకపోతే పొట్ట క్లెన్స్ అవుతుందని ఉద్దేశ్యం. అందుకే మంగళ వారం, శని వారం మీట్ తినకూడదని అనేవారు.
6. పరీక్షకి వెళ్ళేముందు పెరుగు పంచదార తిని వెళ్ళాలి – పెరుగు శరీరాన్ని కూల్ చేస్తుంది, పంచదార ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇవి రెండూ కలిపి తీసుకుంటే బాడీ కూల్ అవ్వడమే కాక ఇమ్మీడియెట్ గా ఎనర్జీ బూస్ట్ కూడా జరుగుతుంది. ఇవి రెండూ ఎగ్జామ్ సరిగ్గా రాయడానికి కావాలి.
7. అద్దం పగిలితే దురదృష్టం – పాత రోజుల్లో అద్దాలు చాలా కాస్ట్లీ. అజాగ్రత్తగా ఉంటే ఇట్టే పగిలిపోతాయి. ఈ మాట చెప్తే వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు కదా.
8. గిఫ్ట్ ఇచ్చేప్పుడు బేసి సంఖ్యలో ఉండాలి – అందుకే మనం పెళ్ళిళ్ళకి, పేరంటాలకీ డబ్బులు చదివించేటప్పుడు నూటొక్క రూపాయి, వెయ్యిన్నొక్క రూపాయి చదివిస్తాం. ఇలా ఎందుకు చేస్తారంటే బేసి సంఖ్య ని సంపూర్ణంగా భాగించడం కుదరదు. సరి సంఖ్యని భాగిస్తే సున్నా శేషం వస్తుంది. సున్నా అంటే శూన్యం కాబట్టి వారి జీవితం అలా ఉండకూడడని ఒక రూపాయి కలిపి ఇచ్చేవారు. అంతే కాక, యాభై, వంది, వెయ్యి.. ఇలా ఏవి తీసుకున్నా సంఖ్య సున్నాతోనే ఎండ్ అవుతుంది. అది కూడా ఒక కారణం కావచ్చు. ఒక రూపాయి యాడ్ చేయడం వల్ల కంటిన్యుటీ ఉంటుంది అనే నమ్మకం.