Movies

పారితోషికం వద్దు. ప్రొడక్షన్ ముద్దు.

పారితోషికం వద్దు. ప్రొడక్షన్ ముద్దు.

బుల్లితెర ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు ‘యంగ్‌ యముడు’ ఎన్టీఆర్‌. ఓ తెలుగు ఎంటర్‌టైన్మెంట్‌ ఛానల్‌ త్వరలోనే ప్రసారం చేయబోయే టాక్‌షోలో తారక్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడట. గతంలో ఎన్టీఆర్‌ ఓ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించి అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. మరోసారి మైక్‌ పట్టుకోబోతున్న ఎన్టీఆర్‌ ఈసారి ఎలాంటి రెమ్యూనరేషన్‌ తీసుకోవడం లేదట. అదేంటీ.. టాలీవుడ్‌లో ఎంతో డిమాండ్‌ ఉన్న తారక్‌ రెమ్యూనరేషన్‌ లేకుండా పనిచేయడం ఏంటీ అనుకుంటున్నారా..? అవును, ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్‌ రెమ్యూనరేషన్‌ తీసుకోవడం లేదట. కాకపోతే.. తానే స్వయంగా డబ్బు పెట్టి నిర్మాత అవతారం ఎత్తనున్నాడని సినీ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.