ScienceAndTech

ఇండియాలో స్పెక్ట్రం వేలం

ఇండియాలో స్పెక్ట్రం వేలం

స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ప్రాథమిక ధర వద్ద రూ.3.92 లక్షల కోట్ల విలువైన 2,251.25 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌(రేడియో తరంగాల)ను వేలం వేయాలన్న ప్రతిపాదనకు అనుమతులు ఇచ్చింది. బిడ్‌లకు ఆహ్వానం పలుకుతూ ఈ నెలలో నోటీసు జారీ చేయాలని టెలికాం మంత్రిత్వ శాఖ భావిస్తోందని ఆ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. వేలాన్ని మార్చిలో నిర్వహించనున్నట్లు విలేకర్లకు చెప్పారు.