Politics

విశాఖ ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టుల పిలుపు

విశాఖ ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టుల పిలుపు

విశాఖపట్నంలో బూటకపు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదలైంది.

దోపిడీ పార్టీలైన వైసీపీ, బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలను తన్ని తరమాలని లేఖలో పేర్కొన్నారు. 

‘‘ఎన్నికలకు ముందు బాక్సైట్ జీవో 97 రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం బాక్సైట్ సరఫరా చేస్తామని జీవో నెంబర్ 89″తీసుకొచ్చారు.

ఉపాధ్యాయుని భర్తీ చేసే ఏజెన్సీ ప్రాంతంలో 100%  ఉద్యోగాలు  జీవో నెంబర్ 3 ఇప్పటివరకు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయలేదు.

రాష్ట్రంలో జగన్ పాలన ఫ్యాక్షనిస్టు నియంత్ర పాలనలా ఉంది

ప్రభుత్వం  ఎన్నికల నిర్వహణ కోసం చివరకు రాజ్యాంగం, నాయస్థానంపై కూడ దిక్కరిస్తూ ఉంది.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మూడు రాజధానులు నాటకాలు ఆడుతుంది అని మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ లేఖలో మండిపడ్డారు.