Sports

మెరుగ్గా సాత్విక్-అశ్వనీ ర్యాంకింగ్స్

మెరుగ్గా సాత్విక్-అశ్వనీ ర్యాంకింగ్స్

భారత అగ్రశ్రేణి మిక్స్‌డ్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు- అశ్విని పొన్నప్ప ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో మెరుగయ్యారు. మంగళవారం ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-20లోకి దూసుకెళ్లారు. టొయొటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీలో సెమీస్‌ చేరుకున్న సాత్విక్‌- అశ్వినిలు 16 స్థానాలు ఎగబాకి కెరీర్‌లో అత్యుత్తమంగా 19వ ర్యాంకు సాధించారు. ఇదే టోర్నీలో పురుషుల డబుల్స్‌ సెమీస్‌ చేరుకున్న సాత్విక్‌- చిరాగ్‌శెట్టి జోడీ పదో ర్యాంకు నిలబెట్టుకుంది. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 7వ, సైనా 19వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 13వ, సాయిప్రణీత్‌ 17వ, కశ్యప్‌ 26వ, సమీర్‌వర్మ 27వ ర్యాంకులు సాధించారు. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చిలో ఆగిపోయిన ర్యాంకింగ్స్‌ ప్రక్రియను ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ అనంతరం పునఃప్రారంభించారు. మార్చి 2 నుంచి 7 వరకు జరిగే స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నీతో టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ పోటీలు మొదలవుతాయి. మే 11 నుంచి 16 వరకు జరిగే ఇండియా ఓపెన్‌తో క్వాలిఫయింగ్‌ సమయం ముగుస్తుంది.