NRI-NRT

నార్వేలో “వీధి అరుగు”

Norway Telugu NRI NRT News - Veedhi Arugu Program Attended By Garikipati

పలు దేశాల్లో ఉన్న తెలుగువారి ఆధ్వర్యంలో జనవరి 31న ‘వీధి అరుగు’ పేరిట చేపట్టిన చర్చా వేదిక కార్యక్రమం ఘనంగా జరిగింది. వర్చువల్‌ పద్ధతిలో దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ సభకు నార్వేలోని భారత రాయబారి బాలభాస్కర్‌, ప్రముఖ అవధాని, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు హాజరయ్యారు. దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా ‘వీధి అరుగు’ విశిష్టతను తెలియజేసేలా నార్వే, 16 దేశాల ప్రవాస తెలుగువారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నార్వేలోని భారత రాయబారి డాక్టర్‌ బి.బాల భాస్కర్‌ ప్రారంభోపన్యాసం చేశారు.