భారత అమ్మాయి అంకిత రైనా సోమవారం ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్లో మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. సింగిల్స్లో ప్రధాన టోర్నీలో ఆడే ఛాన్స్ కోల్పోయిన అంకిత.. డబుల్స్లో పోటీపడే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఒక గ్రాండ్స్లామ్ మహిళల విభాగంలో మెయిన్డ్రాకు అర్హత సాధించిన అయిదో భారత టెన్నిస్ క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించింది. తన కన్నా ముందు నిరుపమా మన్కడ్ (1971), నిరుపమా వైద్యనాథన్ (1998), శిఖా ఒబెరాయ్ (2004) మెయిన్డ్రాలో ఆడారు. సానియా తర్వాత ఒక గ్రాండ్స్లామ్ టోర్నీలో డబుల్స్ బరిలో దిగుతోంది కూడా అంకితనే. రొమేనియా అమ్మాయి మిహెలాతో కలిసి ఆడనున్న అంకిత.. తొలి రౌండ్లో బెలిండా-ఒలివా (ఆస్ట్రేలియా)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్లో నగాల్కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది.
అయిదో అమ్మాయిగా అంకిత రికార్డు
Related tags :