NRI-NRT

నాట్స్ ఆధ్వర్యంలో గణిత వెబినార్

Math Seminar With Bhanu Prakash By NATS

నాట్స్ ఆధ్వర్యంలో వరల్డ్ ఫాసెస్ట్ హ్యుమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ప్రకాష్ తో వెబినార్ నిర్వహించింది. నాట్స్ టెంపాబే విభాగం, ఓం సాయి బాలాజీ టెంపుల్ సంయుక్తంగా చేపట్టిన ఈ వెబినార్‌కు మంచి స్పందన లభించింది. భాను ప్రకాష్ లెక్కల చిట్కాలను విద్యార్ధులకు వివరించారు. మ్యాథ్స్ ద్వారా మన మేథస్సును ఎలా పెంచుకోవచ్చు..? మన మానసిక సామర్థ్యాన్ని పెంచుకోవడంలో మ్యాథ్స్ ఎలా ఉపయోగపడుతుందనేది ఈ వెబినార్‌లో నీలకంఠ భాను ప్రకాష్ వివరించారు. 500 మందికిపైగా విద్యార్ధులు ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. దీనికి కొనసాగింపుగా నాట్స్ మార్చి 14న “మీలో కంప్యూటర్‌ను ఎలా ఆన్ చేయాలి?” మార్చి 21న “గణితానుభవం” మార్చి 28న “ప్రత్యామ్నాయ గణిత సంస్కృతి” వెబినార్ నిర్వహించనుంది. ఈ వెబినార్ నిర్వహణలో నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుతికొండ, నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఉపాధ్యక్షుడు (ఫైనాన్స్‌,మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపా బే విభాగం సమన్వయకర్త ప్రసాద్ ఆరికట్ల, నాట్స్ టాంపాబే చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ సురేశ్ బొజ్జ, నాట్స్ స్థానిక నాయకులతో పాటు ఓం శ్రీ సాయి బాలాజీ ఆలయానికి చెందిన సూర్యనారాయణ మద్దుల, వంశీ తమ్మన, విశాలి ఈ వెబినార్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు విజయశేఖర్‌లు నిర్వాహకులను అభినందించారు.