NRI-NRT

ఇండియాకు కెనడా ధన్యవాదాలు

ఇండియాకు కెనడా ధన్యవాదాలు

భారత్​ నుంచి కొవిడ్​ టీకా డోసులను సాయంగా అందుకున్న కెనడా తన కృతజ్ఞతను చాటుకుంది.

గ్రేటర్​ టొరంటోలోని బిల్​బోర్డ్స్​పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెబుతూ ప్రకటనలను ప్రదర్శించింది.

భారత్​, కెనడాల మైత్రి బంధం సుదీర్ఘకాలం కొనసాగాలని పేర్కొంది.

తమ దేశానికి కొవిడ్​ టీకాలు అందించాలని గతనెలలో కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో.. మోదీకి ఫోన్​ చేసి కోరారు.

ఈ మేరకు గతవారంలో 50,000 డోసుల కొవిషీల్డ్​ టీకాను ఆ దేశానికి భారత్​ సరఫరా చేసింది.