Devotional

ఏపీ ఆలయాల్లో అన్నప్రసాదం నిలుపుదల

AP Govt Stops Distributing Anna Prasadam In Temples

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పలు ఆలయాల్లో అన్నదానం నిలిపేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అన్నదాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం, తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలోనూ నేటి నుంచి అన్న ప్రసాద వితరణ రద్దు చేశారు. భక్తులకు పులిహోర, దద్దోజనం ప్యాకెట్లను మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించారు.