Movies

రిపబ్లిక్ రమ్యకృష్ణ

విశాఖ వాణి…రమ్యకృష్ణ

సాయితేజ్‌ కథానాయకుడిగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. ఐశ్వర్య రాజేష్‌ కథానాయిక. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రను పరిచయం చేస్తూ శనివారం ఆమె ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని చిత్రం బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా సాయితేజ్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘లెజెండరీ నటి రమ్యకృష్ణతో కలిసి నటించడం నాకు దక్కిన గౌరవం. విశాఖ వాణి పాత్రలో రమ్యకృష్ణ నటనను చూపించడానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నా’’అంటూ పేర్కొన్నారు.