DailyDose

పోలీసులపై మావోల పంజా-నేరవార్తలు

Crime News - Maoists Attack Police In Chatteesgarh

* రక్తమోడిన ఛత్తీస్ ఘడ్ …పోలీసు బలగాలను భారీ దెబ్బకొట్టిన మావోయిస్టులు..టర్రెం ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకు ఆరుగురు పోలీసులు .. ఒక మహిళా మావోయిస్టు మృతి ..బీజాపూర్ జిల్లా టర్రెం అటవీ ప్రాంతం కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్ నిన్నటి నుంచి కొనసాగుతున్న భారీ ఎన్ కౌంటర్ ..టర్రెం అడవుల్లో తప్పిపోయిన పోలీసు బలగాల గుర్తింపు కోసం సహాయ చర్యలు ..భారీగా అదనపు బలగాల తరలింపు..మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందంటున్న బీజాపూర్ పోలీసులు.

* నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో కరోనా కలకలం రేగింది.ఇటీవలే ఆ గ్రామంలో ఓ వివాహం జరిగింది. ఈ వివాహానికి వందలాది మంది హాజరయ్యారు. దీంతో వివాహానికి హాజరైన వారిలో 370 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

* విజయవాడ గుణదల విద్యుత్‌ ఉపకేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పాత ట్రాన్స్‌ఫార్మర్‌కు మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు చెలరేగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

* సాయంత్రం వేళ ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థిని రెండు గంటల తర్వాత ఇంటికి తిరిగొచ్చి, అకస్మాత్తుగా ప్రాణాలు విడిచిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. తమ బిడ్డపై అత్యాచారం జరిగిందని, అందువల్లే ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పదో తరగతి విద్యార్థిని గురువారం ట్యూషన్‌కని మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటినుంచి వెళ్లింది. ఆ తర్వాత 5.15 గంటలకు ఇంటికి తిరిగొచ్చి తనపై జరిగిన లైంగిక దాడి గురించి కుటుంబ సభ్యులకు వెల్లడించింది. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అత్యాచారం చేశాక, బాలికకు విషపదార్థం ఇచ్చినట్లు, అందువల్లే ఆమె మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

* రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో రౌడీషీటర్‌ అసద్‌ఖాన్‌ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను ఆయన వెల్లడించారు. అసద్‌పై ఆరుగురు వేట కొడవళ్లతో దాడి చేశారన్నారు. అసద్‌ అల్లుడు యాసిన్‌ ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడని చెప్పారు. 2018లో అంజద్‌ఖాన్‌ హత్య కేసులో అసద్‌ నిందితుడిగా ఉన్నాడని, తన నాన్నను చంపాడనే ప్రతీకారంతోనే కుమారుడు యాసిన్‌ ఈ హత్య చేశాడని డీసీపీ తెలిపారు. స్నేహితుల సహకారంతో హత్యకు పాల్పడ్డాడని చెప్పారు.