Business

కృష్ణపట్నం పోర్టులో 100శాతం అదానీలదే

కృష్ణపట్నం పోర్టులో 100శాతం అదానీలదే

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు పూర్తిగా అదానీ గ్రూపు చేతికి వచ్చింది. ఈ పోర్టులో ఇప్పటికే అదానీ గ్రూపు సంస్థ అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ లిమిటెడ్‌కు 75% వాటా ఉండగా, మిగిలిన 25% వాటా కూడా సొంతం చేసుకుంటోంది. విశ్వ సముద్ర హోల్డింగ్స్‌ అనే సంస్థ నుంచి 25% వాటాను రూ.2,800 కోట్లకు కొనుగోలు చేయడానికి ఈ నెల 1న ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ పోర్ట్స్‌ సోమవారం వెల్లడించింది. దీంతో ఈ పోర్టులో నూరు శాతం వాటాను అదానీ పోర్ట్స్‌ దక్కించుకున్నట్లు అవుతోంది.