బాలీవుడ్లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ కరోనా బారిన పడింది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన నటిస్తోన్న ‘రామసేతు’ చిత్ర యూనిట్ సభ్యుల్లో 40మందికిపైగా జూనియర్ ఆర్టిస్టులు సైతం కరోనా బారినపడ్డారు. కత్రినాకైఫ్ ‘సూర్యవంశీ’ సినిమాలో అక్షయ్తో కలిసి నటించింది. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా కత్రినా కైఫ్ బాయ్ఫ్రెండ్గా వార్తల్లో నిలుస్తున్న విక్కీ కౌశల్ కూడా కరోనాకు గురయ్యాడు. కౌశల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన తర్వాతి రోజే కత్రినా పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
కత్రినాపై కరోనా కాటు
Related tags :