Politics

TRSLPలో TDLP విలీనం

తెలంగాణలో తెదేపాలో తెదేపాకు మిగిలిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధికార తెరాసలో చేరారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రాజీనామా చేసి గులాబీ పార్టీలో చేరగా.. తాజాగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో తెదేపాకు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలూ తెరాసకు మద్దతు తెలిపినట్లయింది. ఈ క్రమంలో తెదేపా శాసనసభాపక్షాన్ని తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేశారు. దీనికి సంబంధించిన లేఖను శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు అందజేశారు.