DailyDose

బాంబు పేలుడుకి 9మంది మృతి-నేరవార్తలు

Crime News - Kadapa Giletin Sticks Explosion Kills Nine

* కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం సంభవించింది. మామిళ్లపల్లె శివారులో జిలెటిన్‌స్టిక్స్‌ పేలడంతో 9 మంది మృత్యువాతపడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. బద్వేలు నుంచి ముగ్గురాళ్ల గనికి జిలెటిన్‌ స్టిక్స్‌ వాహనంలో తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌, ఆయన భార్య ఝాన్సీ అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. లక్ష్మణ్ సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించేవాడని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం నుంచి మృతిచెందిన దంపతుల ఎనిమిదేళ్ల కుమారుడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద సమయంలో ఝాన్సీ కారు నడుపుతున్నట్లు గుర్తించారు. వీరు సూర్యాపేట నుంచి కారులో హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* పెద్దపల్లి జడ్పీ చైర్మన్…పుట్ట మధు అరెస్ట్. భీమవరంలో అరెస్ట్ చేసిన పోలీస్ లు. మధును ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పని పోలీస్ అధికారులు.

* కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘటనపై అనవసరంగా ఎలాంటి సంబంధం లేనప్పటికీ కూడా రాజకీయ దురుద్ధేశంతో, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రా రెడ్డి గారికి అంటగట్టి వారిని నిందిస్తూ,వార్నింగ్ లు ఇస్తూ, ట్విట్టర్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ లు పెట్టి కాపు రామచంద్రారెడ్డి గారి గౌరవానికి భంగం కలిగిస్తూ ఆయనపై ప్రజలలో వ్యతిరేకత ద్వేషం కలిగిస్తూ కాపు రామచంద్రా రెడ్డి గారికి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్ట పరచడానికి కుట్రపన్నినట్లు ఫిర్యాదు *అందడంతో నారా లోకేష్ గారి పై డి.హిరేహాళ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్.111/2021 అండర్ సెక్షన్ ఐ.పి.సి 153(ఆ),505 అంద్ 506 గా కేసు నమోదు చేసినట్లు తెలియవచ్చింది.