‘మన్మథుడు’ నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున బంగార్రాజు – రాముగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా ‘బంగార్రాజు’ను తెరకెక్కించనున్నారు. సినిమా షూటింగ్ జులైలో ప్రారంభించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఇందులో కథానాయికగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటించనున్నట్లు సమాచారం. ఆమెతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. ఇందులో రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య కూడా నటించనున్నారట. సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యే విడుదలైన ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నాగార్జున ఎన్ఐఏ అధికారికాగా నటించి అలరించారు. సినిమా ఓటీటీలోనూ వచ్చేసింది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఆ చిత్రం లాంఛనంగా పూజా కార్యక్రమం పూర్తిచేసుకొంది. ఇక బాలీవుడ్లో రణ్బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న ‘బ్రహ్మస్ర్తా’లో విష్ణు పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సోనాక్షి ప్రస్తుతం శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వంలో ‘బుల్బుల్ తరంగ్’అనే వెబ్సీరీస్లో నటించనుంది.
నాగార్జునతో సోనాక్షీ
Related tags :