Health

ముఖ్యమంత్రికి కరోనా

ముఖ్యమంత్రికి కరోనా

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రంగస్వామి కరోనా బారిన పడ్డారు. సీఎంగా ప్రమాణం చేసిన నాలుగు రోజులకు ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ వైద్యకళాశాలలో రంగస్వామికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చికిత్స కోసం ఆయన చెన్నై వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 7న సీఎంగా రంగస్వామి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈయనతో పాటు ఆ కార్యక్రమానికి హాజరైన 11 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు సమాచారం.