శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం అందడంతో అప్రమత్తమైన అధికారులు దుబాయి నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికురాలి లగేజీని తనిఖీ చేశారు. ఆమె బ్యాగు నుంచి సుమారు 11.1కిలోల బంగారంతో పాటు 1.5 కోట్ల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఏడు క్లాత్ ప్యాకెట్లలో బంగారం, విదేశీ కరెన్సీని తరలిస్తున్నట్టు గుర్తించామని వివరించారు. ఆ మహిళను అరెస్టుచేసి విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు. దుబాయిలో ఈ మహిళకు బంగారాన్ని ఎవరు ఇచ్చారు? ఇక్కడ ఎవరికి ఇవ్వమని చెప్పారు? గతంలో ఏమైనా బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిందా? తదితర కోణాల్లో ఆరా తీస్తున్నట్టు డీఆర్ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు.
శంషాబాద్లో ఆగని బంగారం అక్రమ రవాణా-11.5కిలోలు పట్టివేత

Related tags :