🕑 Published: June 01, 2026 at 10:50 PM CST
ప్రభుత్వానికి, ప్రవాసాంధ్రులకు వారధిలా పనిచేస్తానని ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. మాతృభూమి రుణం తీర్చుకోవడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. డల్లాస్ తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఆయన్ను ఘనంగా సత్కరించారు. కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వర్చువల్గా పాల్గొన్నారు.
ఉత్తర అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత
తొలిసారి డాలస్ నగర పర్యటనలో ఉన్న జయరాం కోమటి అర్వింగ్ (డాలస్) లో సందర్శించి బాపూజీకి పుష్పాంజలి ఘటించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, గవర్నెన్స్ బోర్డు సభ్యులు అనంత్ మల్లవరపు జయరాంకు స్వాగతం పలికి జ్ఞాపికతో సన్మానించారు. ప్రవాస భారతీయుల ఐక్యతకు మహాత్మాగాంధీ మెమోరియల్ ఒక నిలువెత్తు నిదర్శనమని జయరాం అన్నారు.
