🕑 Published: August 10, 2026 at 10:05 AM CST
మలేషియా తెలంగాణ సంఘం (MYTA) ఆధ్వర్యంలో బోనాలు 2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నెగెరి సెంబిలాన్, పోర్ట్ డిక్సన్ సమీపంలోని శ్రీమహాకరుమారియమ్మన్ ఆలయంలో ఆదివారం నాడు నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణాకు చెందిన ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతున్న బోనాల పండుగను మలేషియాలో భక్తితో నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకల్లో భాగంగా భక్తులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మినరల్ వాటర్తో పాటు బస్సు రవాణా సౌకర్యం కల్పించారు.
సంస్థ అధ్యక్షుడు సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు, మహిళా ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రావు, ట్రెజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, జాయింట్ ట్రెజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరి ప్రసాద్, రాములు, రమేష్, మహేష్ మార్త, మధు , జీవన్ రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, జ్యోతి నాంపల్లి, సుప్రియ కంటే, దీపిక, మోనా, పూర్ణ, అనిల్ రావు, హరీష్, శశి, అడ్వైసరీ మెంబర్స్ గురిజాల సుధీర్, మన్సూర్ అహ్మద్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




