
ప్రజల న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ

జస్టిస్ ఎన్వీ రమణ ప్రజల న్యాయమూర్తిగా నిలిచారని సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశంసించారు. దిల్లీలో నిర్వహించిన Narratives of the Bench – A Judge Speaks పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జస్టిస్ రమణ తీర్పులు, ప్రసంగాలు మానవత్వం, సహానుభూతి, సంవేదన ప్రతిబింబించాయని తెలిపారు. ఆయన సీజేఐగా ఉన్న సమయంలో 9 మంది న్యాయమూర్తులకు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించడం, అందులో మహిళలు, బడుగు బలహీన వర్గాలవారికి అవకాశం కల్పించడం సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిందన్నారు. మారుమూల గ్రామంలో పుట్టిన ఒక సామాన్యుడు కూడా కఠిన శ్రమ, అంకితభావంతో న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయికి చేరవచ్చని ఆయన జీవితం సాక్ష్యమని అన్నారు.
జస్టిస్ రమణ న్యాయవ్యవస్థను సామాన్యులకు చేరువ చేశారు, రాజ్యాంగ నైతికతకు చిహ్నంగా నిలిచారని చెప్పారు. కోర్టులు కేవలం వివాదాల పరిష్కార కేంద్రాలు కాక, ప్రజా హక్కుల రక్షణకు నిలబడాలి అని సూచించారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నప్పుడు కోర్టులు వెనకాడకూడదని, అది న్యాయమూర్తుల బాధ్యత అని తెలిపారు. నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ స్థాపన తన కలగా పేర్కొంటూ, భవిష్యత్ సీజేఐలు దాన్ని నెరవేర్చాలని ఆకాంక్షించారు.
Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-Justice BR Gavay Releases Book By Ex CJI Justice NV Ramana
Gallery



Latest Articles
- Chicago Nats Cleans Highways
- Philadelphia Nats Donates 8000 To Feed The Poor
- Ata 2025 Mothers Day In Houston
- Santha Biotech Varaprasad Reddy Meets Sankara Netralaya Usa Team
- Nats Dallas Helps Feed 62 Poor Kids For One Year
- Dont Shop Via Social Media Trump Administration Booking Cases On Tax Evasion
- Tantex 213Th Nntv Ugadi Kavisammelanam 2025
- Tpad Health Seminar With Movva Venkatesh
- Ata Mothers Day Celebrations In 15 Usa Cities
- Tcss Singapore May Day 2025 Celebrations