వాషింగ్టన్ డీసీ లింకన్ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం

Featured Image

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని లింకన్ మెమోరియల్ వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ముఖ్య అతిథిగా పాల్గొని వేల మందితో కలిసి యోగసాధన చేశారు. వాషింగ్టన్, వర్జీనియా, మెరిలాండ్ ప్రాంతాల నుండి ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. భారత రాయబారి కార్యాలయం ప్రత్యేకంగా బస్సులు మరియు భోజన సదుపాయాలను కల్పించింది.

ఈ వేడుకలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుండి విశ్వేశ్వర కళవల, జయశ్రీ, రాము ముండ్రాతి, ఈశ్వర్ బండా, నరసింహ తెలుకుంట్ల, వెంకట్ డండా తదితరులు పాల్గొన్నారు.

వినయ్ క్వాత్రా 2024 ఆగస్టు 12న అమెరికాలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. 1988లో భారత విదేశాంగ సేవలో చేరిన ఆయన 36 సంవత్సరాల తన సేవా కాలంలో దేశీ-విదేశీ పలు కీలక పదవులను అలంకరించారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-International Yoga Day By Indian Embassy At Lincoln Memorial DC

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles