ప్రవాసులతో హరీష్‌రావు అంతర్జాల సమావేశం

Featured Image

ఆదివారం నాడు బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఖండించడమే కాక, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల నుంచి ఎత్తిపోసిన నీళ్ల గణాంకాలు ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని నిరాధార ఆరోపణలు చేయడాన్ని ప్రశ్నిస్తూ, అన్ని అనుమతుల తర్వాతే పనులు ప్రారంభించినట్టు స్పష్టం చేశారు.

ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై జరుగుతున్న ఏసీబీ విచారణపై కూడా హరీష్ రావు స్పందించారు. అన్ని లావాదేవీలు పారదర్శకంగా జరిగాయని, రాష్ట్ర ప్రతిష్టను కాపాడేందుకే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి పాత కేసులను తీసుకువచ్చి కేటీఆర్, కేసీఆర్‌లను లక్ష్యంగా చేసుకుంటూ రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో బీఆర్ఎస్‌కు ఉన్న మద్దతు ఇలాంటి కుట్రలను తిప్పికొడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారాస శ్రేణులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-Harishrao meets with NRI BRS reps globally via zoom along with mahesh bigala

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles