వాషింగ్టన్ డీసీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Featured Image

ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరం అని మన్నవ సుబ్బారావు అన్నారు. ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో యోగా అభ్యసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుల తల్లిదండ్రులు యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమాన్ని భాను మాగులూరి సమన్వయ పరిచారు. మన్నవ మాట్లాడుతూ.. యోగా ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం. యోగా వ్యాయామం మాత్రమే కాదు.. మన జీవన విధానం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో యోగాంధ్రను పెద్దఎత్తున చేపడుతున్నారన్నారు. ప్రతిఒక్కరు యోగాను తమజీవితంలో భాగం చేసుకోవాలని కోరారు.

భాను మాగులూరి మాట్లాడుతూ.. పెద్దలంతా తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని తమ జీవిత అనుభవాలను భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం లక్ష్యం అని అన్నారు. యోగా సాధనలో చిన్నారులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండూరు సీతారామారావు, గోవన మోహనరావు, చెరుకూరి ఇందుశేఖర్, నంబూరి చంద్రనాథ్, బండితోపు సత్యనారాయణ, చిట్టెల సుబ్బారావు, బూర్ల రామకృష్ణ, వనపర్తి నాగిరెడ్డి, వనమా లక్ష్మీనారాయణ, చామర్తి శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-International Yoga Day 2025 In Washington DC By NRIs

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles