విదేశాల్లో మరిన్ని వెంకన్న మందిరాల నిర్మాణం - బెహ్రెయిన్‌లో తితిదే ఛైర్మన్

Featured Image

ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో వీలైనన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరాల నిర్మాణానికి కృషి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డు ఛైర్మన్ బి.ఆర్.నాయుడు వెల్లడించారు. తితిదే ఛైర్మన్ హోదాలో తొలి విదేశీ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం ఆయన బెహ్రెయిన్‌లోని ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. భారత రాయబారితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. బెహ్రెయిన్‌లో స్వామి వారి మందిర నిర్మాణానికి అవసరమైన స్ధలం సేకరించే విధంగా చొరవ తీసుకోవల్సిందిగా రాయబారిని నాయుడు కోరారు. స్వామి వారి కళ్యాణోత్సవం కన్నులపండువగా సాగింది. గల్ఫ్ దేశాల నుండి ప్రవాసులు ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-TTD Chairman BR Naidu Visits Bahrain

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles