కిలారి నవలకు జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక పురస్కారం

Featured Image

సిరికోన సాహితీ అకాడెమీ తరపున జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారకంగా గత నాలుగు సంవత్సరాలుగా ఉత్తమ నవలారచన పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2024 పోటీల విజేతలను సంస్థ నిర్వాహకుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. కథావస్తువును సూచించకుండా నిర్వహించిన ఈ పోటీలకు అనూహ్య స్పందన లభించిందని ఆయన వెల్లడించారు. వడపోత అనంతరం 26 నవలలను న్యాయనిర్ణేతలకు పంపించారు. కథావవస్తువు, ఇతివృత్త నిర్మాణం- వాస్తవికత/తార్కికతలు, శైలి-శిల్పం, సామాజిక ప్రయోజనం అంశాల ఆధారంగా తుది విజేతను ఎంపిక చేశారు.

డా. బి.నాగశేషు రచించిన కిలారికి ఉత్తమ నవల బహుమతి లభించింది. అసాధారణ నిర్మాణ చతురతతో అద్భుత మాండలిక భాషా కథనంతో సమగ్ర గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరించిన 'కిలారి' నవల రచయితకు అభినందనలు తెలిపారు. ఉత్తమ నవలకు బహుమతిగా ₹30వేలు అందజేస్తున్నట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. రెంటాల కల్పన రచించిన కావేరికి అటూ ఇటూ, గన్నోజు రంజిత్ రచించిన లింగాల కంఠంలోకి ప్రత్యేక బహుమతులను ప్రకటించారు.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-Sirikona Sahiti Academy Jonnalagadda Rambhotlu Sarojamma 2024 Novel Winners

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles