బహ్రెయిన్‌లో తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం

Featured Image

బహ్రెయిన్‌లో ఎన్నారై బీఆర్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బెహ్రెయిన్‌లోని అండాలస్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన వేడుకల్లో కేక్ కట్ చేసి ఉత్సాహంగా వేడుకలు జరిపారు. ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాలతో ఏర్పడి, కేసీఆర్ పదేళ్ల పాలనలో అనేక అద్భుతాలు జరిగాయని తెలిపారు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన పేరు చూసి రాజకీయ కుట్రలతో కేసీఆర్, కేటీఆర్‌లపై నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. నాలుగు కోట్ల ప్రజల ముందే అవినీతి బాగోతం బయటపడిందని, కాంగ్రెస్ ప్రభుత్వ దురుద్దేశాలను ప్రజలు త్వరలో తిప్పికొడతారని చెప్పారు. రేవంత్ రెడ్డి పేరు నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్న నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధాన కార్యదర్శులు మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. రైతులు కన్నీటి గాధలు చెబుతుంటే, పేదల ఇళ్లను అందాల పోటీల కోసం ధ్వంసం చేయడం దారుణమన్నారు. మహాలక్ష్మి పథకం పేరుతో డబ్బులేమన్నా అందాల పోటీలకు వేల కోట్లు ఎలా ఖర్చు చేశారంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు గుణపాఠం చెబుతున్న రోజు దగ్గరలో ఉందన్నారు. బీఆర్‌ఎస్ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలదని చెప్పారు. గల్ఫ్‌లో కూడా బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు మహేష్ బిగాల ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో సంగేపు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, నాగుల లక్ష్మణ్, సంగేపు సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Telangana Formation Day 2025 In Bahrain

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles