డల్లాస్ ప్రవాసులతో భారాస నేతల సమావేశం

Featured Image

ఆదివారం నాడు డల్లాస్‌లో నిర్వహించనున్న భారాస రజతోత్సవం, తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారాస నేతలు డల్లాస్ చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఫ్రిస్కోలో వీరితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా భారాస సమన్వయకర్త తన్నీరు మహేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నేతలు, ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

శనివారం నాడు కేటీఆర్ డల్లాస్ చేరుకుంటారని ఎన్నారై భారాస సమన్వయకర్త మహేష్ బిగాల వెల్లడించారు. ఆదివారం వేడుకకు డల్లాస్, అమెరికావ్యాప్తంగా ఉన్న ప్రవాసులతో పాటు దుబాయి, కెనడా దేశాల నుండి కూడా ప్రవాసులు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు డల్లాస్ చేరుకున్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నేతలు ప్రవాసులను ఉత్సాహపరిచారు.

వరంగల్ సభను మించి డల్లాస్ సభ విజయవంతం అవుతుందని, భారాస ప్రభుత్వానికి, తెలంగాణ అభివృద్ధికి ప్రవాసుల చేయూత మరిచిపోలేనిదని నేతలు పేర్కొన్నారు. రసమయి బాలకిషన్ కథలతో తెలంగాణా రాజకీయ పరిస్థితులపై ఛలోక్తలు విసిరారు. గోరేటి వెంకన్నతో కలిసి పాటలు ఆలపించి సభికులను అలరించారు.

ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకరరావు, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, నోముల భగత్, బాల్క సుమన్, శ్రీనివాస్ గౌడ్, విజయారెడ్డి, తాతా మధు, కోరుకంటి చందర్,కొప్పుల ఈశ్వర్, రఘువీర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-BRS Leaders Meet and Greet With Dallas NRIs

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles