వాషింగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రులతో తంగిరాల సౌమ్య సమావేశం

Featured Image

చంద్రబాబు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశ ప్రగతికే మార్గదర్శిగా నిలిచాయని నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య అన్నారు. శుక్రవారం సాయంత్రం వాషింగ్టన్ డీసీలో స్థానిక ప్రవాసాంధ్రులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. భాను మాగులూరి అధ్యక్షతన ఈ అభినందన సభ ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సౌమ్య మాట్లాడుతూ చంద్రబాబు సాంకేతిక విద్య అభివృద్ధి చేయటం ద్వారా అమెరికాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు బాటలు వేశారని కొనియాడారు. ప్రవాసాంధ్రులు తెదేపాను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారని అభినందించారు. గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ పీ-4లో ప్రవాసులంతా భాగస్వాములు కావాలని కోరారు. సతీష్ వేమన, చింతా సతీష్, రమేష్ ఆవిరినేని, రంజిత్ కోమటి, ఎండూరు సీతారామారావు, హనుమంతరావు కూచి, చామర్తి శ్రావ్య, కిషోర్ జాస్తి, చెరుకూరి ఇందుశేఖర్, నంబూరి చంద్రనాథ్, బండి సత్తిబాబు, చిట్టెల సుబ్బారావు, బూర్ల రామకృష్ణ, వనపర్తి నాగిరెడ్డి, వనమా లక్ష్మీనారాయణ, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Nandigama MLA Tangirala Sowmya In Washington DC

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles