🕑 Published: May 23, 2026 at 07:51 AM CST
Telugu Samiti of Nebraska-TANA Paatasalaల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు బడి వార్షికోత్సవం గత శనివారం ఘనంగా నిర్వహించారు.
2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫైనల్ పరీక్షలను విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేయగా, మొత్తం 62 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు.
తెలుగు సమితి అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ మాట్లాడుతూ ప్రారంభం నుండి ముగింపు వరకు తానాతోసాగిన ఈ ప్రయాణం రెండు సంస్థల మధ్య నమ్మకాన్ని, అనుబంధాన్ని మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతో పాటు ముఖ్యంగా తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలతో తప్పకుండా తెలుగులో మాట్లాడాలని సూచించారు. మన భాషే మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు మూలాలకు ప్రతిబింబమని, తెలుగు మాట్లాడటం ద్వారా పిల్లలు తమ వారసత్వానికి మరింత దగ్గరవుతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ప్రధానోపాధ్యాయులు వేణు మురకొండ కృషి చేశారు. గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను శ్వేత బొడెపూడి, పావులూరి సత్యనారాయణ, నవీన్ కంటెం, నాగరాజు ముద్దెల్లిలు విద్యార్థులకు అందజేసి, తెలుగు భాషను ఆసక్తిగా నేర్చుకుని ధైర్యంగా మాట్లాడాలని ప్రోత్సహించారు.
తెలుగు బడి ఉపాధ్యాయులు రాజా, ఉమా, పవిత్ర, దివ్య, సుధీర్, స్వప్న, వీణామాధురి, సువర్ణరేఖ, మౌనిక, సుహిత, తనూజ తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికెట్ల పంపిణీ అనంతరం పిల్లల కోసం ఫేస్ పెయింటింగ్, సరదా ఆటలు మరియు వినోద కార్యక్రమాలు నిర్వహించారు.



