🕑 Published: May 03, 2026 at 01:07 PM CST
ఆస్ట్రేలియా ఎన్నారై బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ బైరెడ్డి ఆధ్వర్యంలో మే 6న, వరంగల్ ఉమ్మడి జిల్లా రైతు సభను విజవంతం చెయ్యాలని పిలుపునిస్తూ పోస్టర్ ను ఆవిష్కరించారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించి 30 నెలలవుతున్న డిక్లరేషన్ లోని హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, రైతులకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ సర్కార్ రైతులకు చేసిన మోసాన్ని వరంగల్ నుంచి ఎండగట్టి రైతులను చైతన్యం చేసే "రైతు సభను" విజయవంతం చెయ్యాలని అనిల్ బైరెడ్డి విజ్ఞప్తి చేశారు.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విచ్చేస్తున్న "వరంగల్ రైతు సభను" జిల్లా నలుమూలల నుండి రైతు ప్రతినిధులు వేలాదిగా తరలిరావాలని వచ్చి విజయవంతం చేయాలని ఆస్ట్రేలియా ఎన్నారై బిఆర్ఎస్ నాయకులు పిలుపునివ్వడం జరిగింది. ఎన్నారై బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ బైరెడ్డి తో పాటు రాహుల్ నడిదే ,రమేష్ ముత్యాల ,మధు పార్స ,సత్య గుండా,రవీందర్ చుక్క ,శ్రీకాంత్ రోహిత్ , హరీష్ రెడ్డి,సజ్జాద్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.