🕑 Published: May 01, 2026 at 12:18 PM CST
ఆంధ్రప్రదేశ్కు చెందిన చందు (26) అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన చందు.. మాస్టర్స్ చేసేందుకు కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. షికాగోలోని డిపాల్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తిచేసిన ఆయన.. ఫుల్టైమ్ జాబ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. చందు భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు స్నేహితులు, తెలుగు సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో పనిచేస్తున్న సురేష్ కుమార్ (41) అనే తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న సురేష్ను ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధరించారు. గుండెపోటు కారణంగా సురేష్ చనిపోయినట్లు తెలుస్తోంది. సురేష్కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. వీరిలో ఏడేళ్ల అబ్బాయికి ప్రత్యేక వైద్య సేవలు అవసరం. మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.