🕑 Published: April 28, 2026 at 10:57 AM CST
బీఆర్ఎస్ పార్టీ 26వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా లండన్ లో ఏన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించి అమరవీరులకు, జయశంకర్కు నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు. యూకే లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కెసిఆర్ పాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టిన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఏన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, సంయుక్త కార్యదర్శి నవీన్ మాదిరెడ్డి, బీఆర్ఎస్ యూకే కమ్యూనిటీ అఫైర్స్ చైర్ పర్సన్ రమేష్ ఎసెంపల్లి, కార్యదర్శి సురేష్ గోపతి, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ కటికనేని, కార్యదర్శి అబ్దుల్ జాఫర్, సంయుక్త కార్యదర్శి అబ్దుల్ ఖుదూస్, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవి రెటీనేని, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, కార్యదర్శి - ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు, కోశాధికారి సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి, మెంబర్షిప్ కో ఆర్డినేటర్: అంజనరావు, యూత్ వింగ్ సెక్రటరీ పవన్ కుమార్ గౌడ్, మీడియా కో ఆర్డినేటర్ సాయి కిరణ్ పేరాల, అజయ్ రావు గండ్, అర్చన, సాయి, అనిల్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
