🕑 Published: April 25, 2026 at 11:29 AM CST
అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభల నిధుల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి ఫ్రిస్కోలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, తదుపరి అధ్యక్షుడు సతీష్ రెడ్డి, సభల కన్వీనర్ బానాల శ్రీధర్ తదితరులు పాల్గొని మహాసభల ఏర్పాట్లపై ప్రసంగించారు. సభల్లో ప్రవాసాంధ్రులు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.










