🕑 Published: June 18, 2026 at 09:48 AM CST
2024 ఎన్నికల విజయం ప్రవాసుల కృషితోనే సాధ్యమైందని చిత్తూరు(జిల్లా) నగరి నియోజకవర్గం శాసనసభ్యుడు గాలి భానుప్రకాష్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఇది బాటలు వేసిందని ఆయన కొనియాడారు. బుధవారం నాడు వర్జీనియాలోని ఛాంటిలీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న అభివృద్ధిపై ఆయన ప్రసంగించారు. విద్య రంగం నూతన సంస్కరణలతో పురోగమిస్తోందని, నగరి నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి తన తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆశీస్సులతో ప్రజాసేవలో ముందుకు సాగుతున్నామన్నారు. 2029 ఎన్నికల విజయం లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
భానుప్రకాష్ మాగులూరి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సతీష్ వేమన, యాష్ బొద్దులూరి, సుధీర్ కొమ్మి, సాయి శ్రీనివాసరెడ్డి భూమిరెడ్డి, సత్యనారాయణరాజు, మాధవనాయుడు బోయెల్ల , ప్రదీప్ గుత్తా, సీతారామారావు యెండూరి, చంద్రనాధ్, వెంకట రెడ్డి, వెంకటేశ్వర్రావు సామినేని, అమరలింగం, సుదర్శన్, సుబ్బారెడ్డి, సుబ్బారావు, వీరభద్రరావు, సురేష్, భిక్షపతి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

