🕑 Published: April 06, 2026 at 10:54 AM CST
ఆంధ్రుల రాజధాని అమరావతికి చట్టబద్దత చారిత్రిక విజయమని అమెరికా రాజధాని ప్రాంతం వాషింగ్టన్ డీసీ - వర్జీనియా ప్రాంత ప్రవాసులు ఆనందం వెలిబుచ్చారు. ఆదివారం నాడు కేక్ కట్ చేసి పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాను మాగులూరి మాట్లాడుతూ, రైతుల త్యాగాలు పోరాటాలు వృధా కాలేదన్నారు. కూటమి చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ కలను సాకారం చేసిందన్నారు. అమరావతి ఏకైక రాజధాని ఉండాలని గత ఐదు సంవత్సరాలలో అమెరికా రాజధాని డీసీ ప్రాంతంలో మద్దతుగా అనేక ఉద్యమాలు చేపట్టారని గుర్తుచేశారు. యశస్వి బొద్దులూరి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పక్షాలు, ప్రజలు ఈ చారిత్రక విజయంలో భాగస్వాములు కావటం ఆనందంగా ఉందన్నారు.
వెంకట్, మురళీ కృష్ణ కట్ల, రమేష్ అవిర్నేని, ఫణి యలమంచిలి, హనుమంతరావు యంపరాల, అభిరామ్ కందుల, కృష్ణమోహన్ జంపాల, కిషోర్ కొడాలి, వెంకటేశ్వర్రావు సామినేని, నరేంద్ర, సీతారామారావు ఎండూరు, సుబ్బారావు చిట్యాల, చంద్రనాధ్ నంబూరు, కామేశ్వరరావు కొత్తూరు, అమరలింగం చనుమోలు, మల్లికార్జునరావు పుట్రేవు, రామ్మోహనరావు చిలకలపూడి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

